ఏపీలో ఘోర ప్రమాదం…లారీని ఢీకొన్న తెలంగాణ ఆర్టీసీ బస్సు, ఇద్దరు మృతి !

-

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర జాతీయ రహదారిపై తెల్లవారుజామున ముందు వెళ్తున్న ధాన్యం లోడు లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ తరుణంలోనే ఇద్దరు మృతి చెందగా, 1O మందికి గాయాలు అయ్యాయి.

మిర్యాల గూడెం నుంచి తిరుపతి వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుతోంది. ప్రమాద స్థలంలోనే డ్రైవర్ వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం కావడంతో నెల్లూరు అపోలో హాస్పిటల్ కి తరలించారు. 8 మందికి చిన్న పాటి గాయాలు కావడంతో కావలి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ వినోద్ నిద్రమత్తు కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుందని సమాచారం అందుతోంది. అటు నెల్లూరుకు వెళ్తుండగా సీత అనే మహిళ కూడా మృతి చెందారు. ఇక దీనిపై కేసు దర్యాప్తు చేసి విచారిస్తున్నారు గుడ్లూరు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news