MI VS PBKS: నేడు క్వాలిఫైయర్ 2 మ్యాచ్.. వర్షం పడితే ఫైనల్ కు వెళ్ళేది ఎవరు ?

-

ఐపీఎల్ మ్యాచ్లు తుది దశకు చేరుకున్నాయి. నేడు అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. గెలిచిన జట్టు ఫైనల్స్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఆర్సిబి జట్టు ఈసారి ట్రోఫీ కోసం ఆరాటపడుతోంది. ఆర్సిబి జట్టు నాలుగు సార్లు ఫైనల్స్ కు చేరుకుంది. మూడుసార్లు విఫలమైంది. MIకు ఉన్న ప్లే ఆఫ్స్ అనుభవం కలిసి రావచ్చని ప్లేయర్లు అంటున్నారు. 21సార్లు MI జట్టు ప్లే ఆఫ్స్ ఆడగా 14 సార్లు విజయం సాధించింది. పంజాబ్ జట్టుకు కూడా అహ్మదాబాద్ లో మంచి రికార్డు ఉంది.

పంజాబ్ జట్టు ఆడిన 6 మ్యాచుల్లో నాలుగు సార్లు విజయం సాధించింది. హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలించినట్లయితే 33 మ్యాచుల్లో….17 ముంబై ఇండియన్స్ జట్టు, 16 మ్యాచుల్లో పంజాబ్ విజయం సాధించింది. ఫైనల్ లోకి ఏ జట్టు అడుగు పెట్టబోతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఈరోజు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ ఎవరు గెలుస్తారో చూడాలి. మొదట బౌలింగ్ చేసిన జట్టు విజయం సాధిస్తుంది. ఒకవేళ వర్షం పడినట్లయితే పాయింట్ల పట్టిక ప్రకారం పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఫైనల్స్ కు చేరుకుంటుంది. ఫైనల్స్ లో ఆర్సిబి జట్టుతో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ మూడవ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news