డిసెంబర్ వరకు యూనివర్సీటీల్లో పోస్టుల భర్తీ : మంత్రి బొత్స

-

ఇవాళ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్య కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేటు స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు. విశాఖలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. విశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. విద్య కోసం సీఎం జగన్ ఎంతో చేస్తున్నారు. 60వేల క్లాస్ రూమ్స్ లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాద్యాయులు మా కుటుంబ సభ్యులే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా జీతాలు ఇవ్వలేదని అవాస్తవాలు రాస్తున్నాయి కొన్ని ఛానెళ్లు, పత్రికలు. ప్రైవేట్ స్కూళ్ల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ర్యాంకులు వచ్చాయి. అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటిని డిసెంబర్ వరకు భర్తీ చేస్తామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news