BREAKING : నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

-

ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

A terrible accident in AP Three youths died

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లో లేక అతివేగంగా వాహనాన్ని నడపడం వల్లో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మృతులు హైదరాబాద్ నుంచి వచ్చిన వారని మాత్రమే తెలిసిందని, ఇంకా వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news