చంద్రబాబు జైలుకు పోవడంతో..తిరుమల శ్రీవారి మొక్కులు చెల్లించిన రోజా

-

తప్పు చేసిన చంద్రబాబుకి శిక్షపడాలని అందరూ కోరుకున్నారన్నారు మంత్రి రోజా. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు శిక్షపడడంతో మ్రొక్కులు చెల్లించుకున్నానని.. చంద్రబాబుకి పూర్తిస్థాయిలో భధ్రతా ఏర్పాట్లు కల్పించామని వెల్లడించారు నారా లోకేష్ గగ్గోలుపెడుతున్న తీరు చూస్తూ వుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు… చంద్రబాబుది అక్రమ కేసు కాదు…అడ్డంగా దోరికిపోయిన కేసు అని విమర్శలు చేశారు మంత్రి రోజా.

స్కీల్ డెవల్పెంట్ కేసులో లోపలికి వెళ్ళిన చంద్రబాబు….ఇక లోపలే వుంటాడని హోచ్చరించారు మంత్రి రోజా. నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణలు కూడా లోపలికి వెళ్ళడానికి సిద్దమవ్వాలని చురకలు అంటించారు. నిన్న టిడిపి బంద్ కి పిలుపునిస్తే…చంద్రబాబు భార్య,లోకేష్ భార్య పట్టించికోకూండా హేరిటేజ్ ని ఒపేన్ చేసారని ఎద్దేవా చేశారు. స్కిల్ డెవెల్పెంట్ కేసే కాదు….వరుసగా అమరావతి భూములు కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, పట్టిసీమ కేసు, పోలవరం కేసులు సాక్ష్యాధారాలతో సహ వెలుగు చూస్తాయన్నారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Exit mobile version