వైసిపికి మనుషులంటే అలర్జీ..జగన్ పై బాలయ్య సీరియస్

-

వైసిపికి మనుషులంటే అలర్జీ అంటూ జగన్‌ సర్కార్‌ పై ఆగ్రహించారు నందమూరి బాలకృష్ణ. టిడిపి అధ్యక్షుడు పై కక్ష సాధింపు చేస్తున్నారని..స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి ఆరోపణలు చేసి చంద్రబాబు పై బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్…ఇది ప్రపంచానికి తెలుసు…ఎటువంటి ఆధారాలు లేని స్కాం నీ ప్రభుత్వం క్రియేట్ చేసిందని ఆగ్రహించారు.

balayya slams cm jagan

ఎన్టీఆర్‌ కాలం నుండే యువత కు అభివృద్ధి లో నైపుణ్యం ఇప్పించాలన్న ఆలోచన టిడిపి చేస్తుందని..ముఖ్య మంత్రి పాలసీ మేకర్ మాత్రమే అన్నారు. పాలసీ లు అమలు పరిచేది అధికారులేనని… గుజరాత్ లో కూడా ఈ తరహా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. రూ. 370 కోట్లు నాలుగు విడతలుగా ప్రభుత్వం విడుదల చేసింది….రెండు లక్షల కు పైగా యువత కు నైపుణ్యం కల్పించాం…డెబ్బై వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. డిజైన్ టెక్ సంస్థ ను వైసీపీ ప్రభుత్వం కూడా మెచ్చుకుందని చెప్పారు నందమూరి బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version