త్వరలోనే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం

-

ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి రోజా. Asian Games లో సిల్వర్ మెడల్ సాధించిన సాకేత్ మైనేని కి మంత్రి రోజాతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. సాకేత్ చాలా అదృష్టవంతుడు…సక్సెస్ అయిన వారు ఎవరూ పూలబాటలో రాలేదన్నారు. టెన్నిస్ చాలా ఖర్చుతో కూడుకున్న క్రీడ… 12 సంవత్సరాలుగా సాకేత్ పతకాలు సాధిస్తున్నారని వెల్లడించారు.

9 సంవత్సరాల గ్యాప్ తరువాత కూడా సిల్వర్ సాధించారని కొనియాడారు. ఏషియన్ గేమ్స్ లో 107 పతకాలు మన దేశానికి వచ్చాయని పేర్కొన్నారు. మన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అధిక పతకాలు సాధించారని కొనియాడారు. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నట్టు నేను క్రీడా మంత్రి అయిన తరువాత ఇన్ని పధకాలు సాధించామని.. త్వరలో సాకేత్ మైనేనికి ఉద్యోగం, అకాడమీ ల్యాండ్ కూడా ఎన్నికల లోపే చేస్తామని ప్రకటించారు. క్రీడాకారుడి కులం, మతం, పార్టీ చూడకుండా సహకరించాలని కోరారు ఏపీ మంత్రి రోజా.

 

Read more RELATED
Recommended to you

Latest news