జగన్ రక్తం చూసినా… టీడీపీకి రక్తపు కన్నీరు ప్రజలు తెప్పిస్తారు – మంత్రి రోజా

-

జగన్ రక్తం చూసినా… టీడీపీకి రక్తపు కన్నీరు ప్రజలు తెప్పిస్తారని హెచ్చరించారు మంత్రి రోజా. తిరుపతిలో మంత్రి రోజా మాట్లాడుతూ…విజయవాడ తన పచ్చ రౌడిలతో చంద్రబాబు…. జగన్ పై రాళ్ళు హత్యాయత్యం చేయించాడని ఆగ్రహించారు. జగన్ పై దాడితో రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరూ షాక్ కు గురి అయ్యారు.

ప్రజలు అభిమానించే నాయకుడి చంపి అధికారంలోకి రావాలని కుట్ర,కుతంత్రం రాజకీయాలు చంద్రబాబు చేశాడని ఆరోపణలు చేశారు. గతంలో కత్తితో ఫొడిచి చంపాలని చూశారు..ఇప్పుడు వీధి దీపాలు ఆఫ్ చేసి ఈ విధంగా కుట్రకు పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్ పై దాడితో రాష్ట్ర ప్రజలందరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు..జగన్ రక్తం చూసినా మీకు మే 13 న ప్రజలు ఓట్లతో మీకు రక్తకన్నీరు తెప్పిస్తారని స్పష్టం చేశారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news