తిరుమల లడ్డు కల్తీ వివాదంపై రోజా వివాదస్పద వ్యాఖ్యలు

-

తిరుమల లడ్డు కల్తీ వివాదం పై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారని ఆగ్రహించారు. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు లడ్డు తీసుకోవాలా, తినాలా వద్దా అని అలోచిస్తున్నారని బాంబ్‌ పేల్చారు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారని వెల్లడించారు. ఏపీ తెలంగాణ ప్రజలు ఎవరు దీని నమ్నరు కానీ ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారని రోజా తెలిపారు.

Roja’s controversial comments on the laddu kalti controversy

సినిమాల్లో ఒక్కో గెటప్ ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ మాట్లాడుతుంటాడని పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయారు. పాపం పవన్ కళ్యాణ్ కి ఏమి తెలియదు ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడడమే పని…. ట్యాంకర్లు వచ్చింది, శాంపుల్ తీసుకుంది, ల్యాబ్ కు పంపింది, రిపోర్టు వచ్చింది అన్ని చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే అన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా జీరో చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి కుట్రకు తేరలేపారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version