వైద్యం వికటించి బాలింత మృతి..!

-

వైద్యం వికటించి బాలింత మృతి చెందిన సంఘటన సత్తుపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రావణి (21) నిండు నెలల గర్భిణీ.  నెలలు నిండటంతో సత్తుపల్లి పాత సెంటర్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.  ఆమెకు ఆసుపత్రి వైద్యురాలు ఆపరేషన్ చేయడంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

ఆపరేషన్ వికటించినట్టు తెలియడంతో తీవ్ర రక్తస్రావమై అప్పటికే శ్రావణి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం నగరానికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు ఆమె మృతదేహాన్ని సత్తుపల్లికి తీసుకొచ్చి.. ఆసుపత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version