ఏపీ విద్యార్థులకు అలర్ఠ్…రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్

-

ఏపీ విద్యార్థులకు అలర్ఠ్…రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతుగా నవంబర్ 8న అంటే రేపే విద్యాసంస్థల బంద్ చేపట్టనున్నట్లు PDSU, AISF, AIYF ప్రకటించాయి.

school

విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి రేపటితో వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపట్టనున్నారు. అన్ని యువజన, విద్యార్థి సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి.

ఇది ఇలా ఉండగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా… కేంద్రం దీనిపై ముందుకు అడుగులు వేస్తోంది. కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పక్షాలు, అధికార వైసిపి.. అలాగే విశాఖ ఉక్కు కార్మికులు దీనిపై పోరాటం చేస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news