ఇవాళ, రేపు స్కూల్స్ బంద్.. కారణం ఇదే !

-

విశాఖలో యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. యోగా డే ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలోనే మంత్రుల బృందం ఉంది.. ఆర్కే బీచ్‌ రోడ్‌లో ప్రధాన వేదిక నిర్మాణం చేయనున్నారు. ఇవాళ విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అటు పవన్ కళ్యాణ్ కూడా వస్తారు.

Schools to remain closed for two days today and tomorrow due to traffic maintenance
Schools to remain closed for two days today and tomorrow due to traffic maintenance

రేపు జరగబోయే ప్రపంచ యోగా దినోత్సవం లో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ చేరుకుంటారని అధికారిక ప్రకటన వెలువబడింది. అటు 25 వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయనున్నారు. విశాఖ తీరంలో ఇవాళ, రేపు చేపల వేటపై ఆంక్షలు ఉంటాయి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు.అటు విశాఖలో భారీ ట్రాఫిక్ జామ్‌ చోటు చేసుకుంది. యోగాంధ్ర కార్య‌క్ర‌మానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో.. కిలోమీట‌ర్ల మేర బారులు తీరాయి వాహ‌నాలు. భారీ ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులు ప‌డుతున్నామంటున్నారు వాహ‌న‌దారులు.. ట్రాఫిక్ మెయింటెనెన్స్ కార‌ణంగా ఇవాళ, రేపు రెండు రోజుల పాటు  స్కూల్స్‌కు సెలవులు ప్రకటించింది ప్ర‌భుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news