తండ్రి కోసమేగా వెళ్లింది.. “అరగంట కోసం” కాదుగా అంటూ మంత్రి అంబటి రాంబాబు పై టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. నారా లోకేష్ భార్య పిల్లలను వదిలేసి ఢిల్లీకి పారిపోయారంటూ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కు టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ‘తండ్రి కోసమేగా వెళ్ళింది.. అరగంట కోసం కాదుగా సోంబేరి సారు’ అని రిప్లై ఇచ్చారు.
![Senior TDP leader Ayyannapatra has fired on Ambati Rambabu](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/10/Senior-TDP-leader-Ayyannapatra-has-fired-on-Ambati-Rambabu.webp)
అంతకు ముందు ‘తండ్రిని అరెస్టు చేస్తే భార్య పిల్లలను వదిలి ఢిల్లీ పారిపోయిన పిరికి బడుద్దాయి లోకేష్’ అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ దగ్గర్నుంచి టీడీపీ వాళ్లు నేరం చెయ్యలేదు అని ఎక్కడా చెప్పడం లేదని..దొరికిన దొంగలకు మర్యాద చెయ్యలేదు అని వాదిస్తున్నారని అంబటి పేర్కొన్నారు. విచారణకు సిద్ధంగా లేని వాదనలు వినిపిస్తున్నారని.. అన్ని కోర్టుల్లో ఒకే రకమైన వాదనలు వినిపిస్తున్నారని వెల్లడించారు.