వైసీపీకి షాక్.. రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ..!

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. వైసీపీ కి చెందిన పలువురు నేతలు అధికార కూటమిలో చేరుతున్నారు. కొంత మంది టీడీపీలో, మరికొందరూ జనసేనలో, ఇంకొందరూ బీజేపీలో ఇలా మొత్తానికి వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నారు.

తాజాగా వైసీపీ నుంచి మరో వికెట్ డౌన్ అయింది. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి వైసీపీకి రాజీనామా చేసారు. ఆయన టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. గూడూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యేగా పనిచేసిన బల్లి దుర్గాప్రసాద్  2019లో వైసీపీలో చేరారు. తిరుపతి లోక్ సభకు 2019లో ఎన్నికయ్యారు దుర్గా ప్రసాద్. ఎంపీగా ఉంటూ మరణించడంతో ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు అప్పటి సీఎం జగన్. తాజాగా ఆయన వైసీపీ ని వీడి టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version