పుష్పలో బన్నీ స్మగ్లింగ్‌ చేసినట్లు..వైసీపీ మద్యం స్మగ్లింగ్‌ చేస్తోంది – సోమిరెడ్డి

-

పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్లు తారు ట్యాంకర్లలో వైసీపీ నేతలు కల్తీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో రూ.20కి కొని ప్రభుత్వ దుకాణాల్లో రూ.200పైచిలుకు విషపూరితమైన కల్తీమద్యం అమ్ముతూ పట్టుబడిన ఘటన వెనుక వైసీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆరోపించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ఈ నకిలీ మద్యం అమ్మకాలు సాధ్యం కాదని.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లేబుల్ మార్చి అమ్మే కల్తీ మద్యంలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఫైర్‌ అయ్యారు. 2014లోనే రాష్ట్రపతి పాలనలోనే ఆనాటి సర్వేపల్లి, కావలి ఎమ్మెల్యేలపై కల్తీ మద్యంపై 11కేసులు నమోదయ్యాయని… ప్రతీ కేసులో గోవా, పాండిచెర్రీ, తమిళనాడు, కర్ణాటక స్మగ్లర్లు పట్టుబడ్డారన్నారు. నాటి కేసుకు తాజాగా నెల్లూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం సంఘటనలు ముడిపడి ఉన్నాయని…2014లో గోవా, పాండిచెర్రీ, కర్ణాటకా, తమిళనాడులు మీదుగా కల్తీ మద్యం రవాణా జరిగినట్లే ఇప్పుడూ జరిగిందని పేర్కొన్నారు.

సీబీఐ విచారణ జరిపిస్తే అన్నీ బయటకు వస్తాయని.. 2014లో పట్టుబడిన మద్యాన్ని ప్రయోగశాలల్లో పరీక్షిస్తే ప్రాణాంతక రసాయనాలు అందులో ఉన్నట్లు గుర్తించారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు సరఫరా చేసిన కల్తీమద్యం తాగి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయిన ఘటన ఎవ్వరూ మరువలేదని.. అధికార పార్టీ ఎమ్మెల్యేలే నరహంతకులుగా మారి ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news