వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా – సోము వీర్రాజు

-

రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని బీజేపీ నేత సోము వీర్రాజు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన…’వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. అధిష్టానం ఎక్కడ బరిలోకి దిగమంటే…. అక్కడే పోటీకి దిగుతా. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు…. కంటి తుడుపు చర్య. వైసీపీ అనాలోచిత నిర్ణయాలు తప్ప…రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు’ అని మండిపడ్డారు.

పండగ లోపులో 32మందితో బిజెపి ఎన్నికల కమిటీ నియామకం చేస్తామని వెల్లడించారు. పార్లమెంటు అసెంబ్లీలకు వేరువేరుగా మేనేజ్మెంట్ కమిటీలు, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు సంస్థాగత కమిటీలు నియమిస్తున్నట్లు ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ నవరత్నాలు కంటి తుడిపి చర్య అని విమర్శించారు. వైసిపి అనాలోచిత నిర్ణయాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదని ఆరోపించారు. దేశంలో మోడీని విమర్శించే అర్హత ఎవరికి లేదన్నారు. మంత్రులు మాట్లాడుతున్న తీరు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతుందో తెలియని భావన కలుగుతుందని అభిప్రాయపడ్డారు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Latest news