సోనియా గాంధీ ,చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని చంపారు – నారాయణస్వామి

-

YSR హెలికాప్టర్ ప్రమాదంపై ప్రజలకు సందేహాలున్నాయని…సోనియా గాంధీ ,చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని చంపారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి. సోనియా గాంధీ ,చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్లో ప్రమాదంలో చంపారని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు.

Sonia Gandhi and Chandrababu together killed Rajasekhar Reddy said Narayanaswamy

వాళ్ళు ఇద్దరు కలసి వైఎస్ ను చంపారని ప్రజలందరికి తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.
ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియాగాంధీకి చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు రాజకీయ బిచ్చ పెట్టింది రాజశేఖర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు సోనియాగాంధీ కలిసి రాజశేఖర్ రెడ్డిని హింసించి పొట్టన పెట్టుకుంది మీకు తెలియదా…అంటూ ప్రశ్నించారు. ఏమి తప్పు చేయనటువంటి వ్యక్తి ఎవడికి భయపడినటువంటి వ్యక్తి జగన్ ను అన్యాయంగా కేసు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు..అప్పుడు ఏమైంది మీ నోర్లు ఎక్కడి పోయాయని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version