ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త..రాగులు, గోధుమ పిండి పంపిణీ ప్రారంభం

-

ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త. రేషన్ కార్డుదారులకు రాగులు, గోధుమ పిండి పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. చిత్తూరు జిల్లా పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు మూడు కిలోల రాగులు, కిలో గోధుమపిండి పంపిణీకి పుంగనూరు నుంచి శ్రీకారం చుట్టారు.

అదే విధంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు. పుంగనూరు మున్సిపాలిటీకి చెత్త సేకరణ కోసం ఇటీవల ప్రభుత్వం అందించిన 15 ఈ ఆటోలను ప్రారంభించారు ఈ ఇద్దరు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…ఫోర్ట్ఫైడ్ గోధుమ పిండి పంపిణీ పుంగనూర్‌ పట్టణం లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని.. ఎన్నికల హామీలు ఆ తర్వత ఎన్నికల సమయంలో చూద్దాం లే, అనే స్థాయి నుండి అధికారంలోకి రాగానే అమలు చేయాలనే స్థాయికి రాజకీయాలను తీసుకొచింది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. గతంలో ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు చెప్పాల్సిందేనని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news