వింత చోరీ: ఆలయం నుండి ఏం ఎత్తుకెళ్లారో చూస్తే అవాక్ అవుతారు..!

-

రోజు రోజుకి హిందూ ఆలయాల్లో చోరీలు ఎక్కువై పోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మరో హిందూ ఆలయం లో వింత చోరీ ఒకటి చోటు చేసుకుంది. ఈ దొంగ హుండీ జోలికి వెళ్ళలేదు, బంగారం కూడా కాజేయలేదు. కానీ ఈ దొంగ తీసికెళ్ళింది ఏమిటో చూస్తే షాక్ అవుతారు. వివరాల లోకి వెళితే… ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా అప్పన్నపల్లి లోని శ్రీ బాల బాలాజీ ఆలయంలో చోటు చేసుకుంది. ఎంతో వింతగా ఈ దొంగ తలనీలాలు దొంగతనం చేశాడు. ఏకంగా ఒక బ్యాగు నిండా తల నీలాలను దోచుకెళ్లాడు.

శ్రీ బాల బాలాజీ ఆలయం లో తలనీలాల కాంట్రాక్ట్ ను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శ్రీనివాస ఇంటస్ట్రీస్ సంస్థ చూస్తోంది. అయితే ప్రతి ఏటా రూ.30లక్షల రూపాయల తో తలనీలాల వేలం పాటను సొంతం చేసుకుంటోంది. వీటిని ఆలయం లోని స్ట్రాంగ్ రూమ్ లో ఉంచుతారు. ఆ స్ట్రాంగ్ రూమ్ ను ఆలయ సిబ్బంది, శ్రీనివాస ఇండస్ట్రీస్ ప్రతినిథులు మాత్రమే తెరుస్తారు. ఆలయ అధికారులు ఓ తాళం, శ్రీనివాస ఇండస్ట్రీస్ మరో తాళం వేశాయి. దొంగ మాత్రం రెండు తాళాలు బద్దలుకొట్టేసి తలనీలాలని ఎత్తికెళ్ళాడు.

వీటి విలువ దాదాపు రెండు లక్షల రూపాయలుంటాయని తెలుస్తోంది. ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి తలనీలాల బ్యాగుతో పరారయ్యాడు. ఈ విషయం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. చోరీ జరిగిన తీరుచూస్తుంటే ముందు రెక్కీ నిర్వహించిన తర్వాతే దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. లేదా బాగా తెలిసిన వారే చేసి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news