ఇవాళ్టి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

-

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి జనవరి 5 వరకు ఆధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో ఆధ్యాయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు గోష్టిగానం చేస్తారు.

Notification for 56 posts in TTD
Notification for 56 posts in TTD

కాగా, తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక గడిచిన 24 గంటలలో టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. అటు నిన్న ఒక్క రోజే తిరుమల 64,882 మంది భక్తులు..తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 24,900 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. ఇక ఇక గడిచిన 24 గంటల లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.28 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news