BREAKING : అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

-

టీడీపీ సభ్యులకు మరోసారి బిగ్‌ షాక్‌ తగిలింది. అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు స్పీకర్‌ తమ్మినేని. రెడ్ లైన్ దాటి టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియం ఎక్కారు. ఈ సందర్భంగా వాయిదా తీర్మానం పై టీడీపీ ఎమ్మెల్యేలు..పట్టుబట్టారు.

BREAKING : అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అనంతరం రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే సభలో పలు బిల్లులకు ఆమోదం లభించింది. కాగా ఇవాళ మూడు బిల్లులను ఆమోదించింది ఏపీ అసెంబ్లీ.

మూడు బిల్లులను ఆమోదించింది ఏపీ అసెంబ్లీ

1. ఆర్జేయూకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024

2. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024

3. ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)

 

Read more RELATED
Recommended to you

Exit mobile version