చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. కేసరపల్లికి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు

-

ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరుకానున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా భారీగా తరలివస్తున్నారు. ఉదయమే పెద్ద సంఖ్యలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ సహా ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలోకి వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇక కేసరపల్లికి వచ్చే పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ-గన్నవరం మార్గంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా కాజా టోల్‌ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. టోల్‌ రుసుం కోసం వాహనాలను సిబ్బంది నిలిపివేశారు. దీంతో సుమారు 2కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news