నేడు టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఏ క్షణమైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమైంది టిడిపి మరియు జనసేన.

tdp-janasena
tdp-janasena

 

ఇవాళ ఏకంగా 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. అయితే వీటిలో టిడిపికి ఎన్ని సీట్లు ? జనసేనకు ఎన్ని సీట్లు ? కేటాయిస్తారో తెలియాల్సి ఉంది. అటు టిడిపి మరియు జనసేన పార్టీలు బిజెపి పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే 60 నుంచి 70 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు టిడిపి మరియు జనసేన సిద్ధమయ్యాయి. దీంతో రెండు పార్టీల నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news