ఎమ్మెల్సీ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు – జయమంగళ వెంకటరమణ

-

ఎమ్మెల్సీ ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు జయమంగళ వెంకటరమణ. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో టీడీపీ సీనియర్‌ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ చేరారు. 2009లో కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకట రమణ, ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు.

నిన్ననే టీడీపీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇంచార్జ్‌ పదవికి రాజీనామా చేశారు. జయమంగళ వెంకట రమణతో పాటు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు చేరారు. ఈ సందర్భంగా జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ, ఇంచార్జ్ అంటే టీడీపీలో రెడ్‍కార్పెట్‍లు పరిచే పని మాత్రమేనని.. ఆ పని చేసి, చేసి అలసిపోయానని తెలిపారు. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో విబేధాల్లేవన్న జయమంగళం.. ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. అదే ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారన్నారు జయమంగళం.

Read more RELATED
Recommended to you

Exit mobile version