ఇండియా మొత్తానికి డ్రగ్స్‌ ఏపీ నుంచే సప్లై అవుతోంది – టీడీపీ ఎమ్మెల్యే

-

ఇండియా మొత్తానికి డ్రగ్స్‌ ఏపీ నుంచే సప్లై అవుతోందని.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సంచలన వ్యాక్యలు చేశారు. కొత్త బార్ పాలసీ ద్వారా 800 బార్ లకు రెండేళ్ళు అనుమతించిన జగన్ మద్యనిషేధం ఎలా చేస్తాడు..? అని నిలదీశారు. మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని మేం బయటపెట్టిన నివేదికపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

మద్యం తయారు చేయించేది జగన్, ప్యాపారం చేయించేది ప్రభుత్వం, అమ్మేది వైసీపీ కార్యకర్తలు అని.. ముఖ్యమంత్రే మద్యం వ్యాపారం చేయటం ప్రజలు చేసుకున్న దురదృష్టమని ఆగ్రహించారు. ఎంపిక చేసుకున్న కొంతమంది బినామీలతో మద్యం వ్యాపారం చేయిస్తూ, ఆ డబ్బునే తిరిగి ఎన్నికల్లో ఖర్చు చేయనున్నారు.. మొబైల్ బెల్టుషాపులు పెట్టి మరీ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. దేశం మొత్తానికి మాదక ద్రవ్యాల సరఫరా ఏపీ నుంచే జరుగుతోందని.. వాటాల్లో తేడాలొచ్చే కేసులు బయటకు వస్తున్నాయని చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version