తలసరి ఆదాయంలో తెలంగాణాదే మొదటిస్థానం – చంద్రబాబు

-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…సంచలన వ్యాఖ్యలు చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. ఇక్కడి ప్రభుత్వాలు బాగా పని చేయడం వల్ల… తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉందన్నారు. పెద్ద రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్‌ను దాటుకొని తెలంగాణ అగ్రభాగాన ఉందని వివరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

chandrababu

తెలంగాణ గడ్డపైన పుట్టిన పార్టీ టీడీపీని మళ్ళీ నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. యువరక్తాన్ని ఎక్కిస్తా పార్టీకి.. తెలంగాణలో త్వరలోనే పార్టీ నిర్మాణం చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు 70,80 దేశాల్లో తెలుగు వాళ్ళు రోడ్డెక్కి నిరసనలు తెలిపారని తెలిపారు.

ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version