విజయవాడలో ఉద్రిక్తత.. జనసేన కార్యకర్తల అరెస్ట్

-

సోమవారం ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్. పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చికుక్క అని, పెళ్ళాలను, పార్టీలను మార్చుతాడంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యదర్శి అమిరిశెట్టి వాసు ఆధ్వర్యంలో నేతలు ఆందోళనకు దిగారు.

జోగి రమేష్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి జోగి రమేష్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార మదంతో అడ్డగోలుగా మాట్లాడితే సహించబోమని జనసైనికులు హెచ్చరించారు. అనంతరం పలువురు జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news