“ఇండియా” కూటమి కీలక నిర్ణయం!

-

మణిపూర్ లో జాతుల మధ్య చోటుచేసుకున్న హింస అంశం ఉభయ సభలలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ అల్లర్లపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఈ అంశం కారణంగా ఉభయసభలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో నేడు విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అయితే ప్రతిపక్షాల డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడంలేదని.. ఈ నేపథ్యంలోనే బిజెపి ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి డిసైడ్ అయిందని సమాచారం. మరోవైపు విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు, రాజ్యసభ 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news