బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సింగిల్ గానే పోటీ చేస్తాం. సింగిల్ గానే గెలిచి అధికారంలోకి వస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అధికారం కోసం కొందరూ కండువాలు మార్చడం కామన్ అని పరోక్షంగా అన్నారు. సిరిసంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరూ సిద్ధంగా ఉన్నారని కీలక ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గడిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయారని అన్నారు. దీంతో మరోసారి తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని అన్నారు. ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచే వారు కాదని హాట్ కామెంట్స్ చేశారు.