జగన్ ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి – అచ్చెన్నాయుడు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రాజమండ్రి మహానాడులో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలలో 151 స్థానాలు రావడంతో జగన్ కు కళ్ళు నెత్తికెక్కాయని.. 2019లో ఓ దోపిడి దొంగకు ఓట్లు వేసీ ప్రజలు తప్పు చేశారని అన్నారు. జగన్ ను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు అచ్చెన్నాయుడు.

రూ. 2000 నోటు ఉపసంహరణతో తన దగ్గరున్న డబ్బులను ఏం చేయాలో తెలియక జగన్ తల పట్టుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో టిడిపి 160 స్థానాలు గెలుచుకుంటుందని జోష్యం చెప్పారు. బాబాయ్ హత్య కేసు తమ మీదకు వస్తుందని జగన్ భయపడుతున్నారని అన్నారు. మహానాడుకు ప్రభుత్వం బస్సులు ఇవ్వకుండా, ప్రజలను రాకుండా చేశారని మండిపడ్డారు. మహానాడు కోసం అలంకరణ చేస్తే జగన్ బ్లేడ్ బ్యాచ్ ఫ్లెక్సీలను తొలగించారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version