రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త అందించింది రైల్వే శాఖ. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందే చార్ట్ సిద్ధం చేసేందుకు నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. అంతకుముందు రైలు బయలుదేరే ముందు ఈ చార్ట్ ప్రిపేర్ అయ్యేది.

కానీ ఇకపై 8 గంటల కంటే ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కీలక మార్పుతో వెయిటింగ్ లిస్టు టికెట్లు ఉన్న ప్రయాణికులకు కాస్త రిలీఫ్ దక్కనుంది. వాళ్లకు ట్రైన్ బయలుదేరే 8 గంటలకంటే ముందే.. సీట్ కన్ఫర్మ్ అవుతుంది. దాంతో టెన్షన్ లేకుండా రైలు ప్రయాణం చేయవచ్చు. తాజాగా తీసుకున్న రైల్వే శాఖ నిర్ణయం పై… ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.