వివేకానంద రెడ్డి కి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు : సునీత

-

వివేకానంద రెడ్డి కి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు అని ఆయన కూతురు సునీత ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన వర్థంతి  సందర్భంగా నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ట్రయల్ ఇంకా మొదలు పెట్టలేదు. ఓటు అనే అస్త్రం తో మా అన్న పార్టీకి ఓటు వేయవద్దు. ఈ ప్రభుత్వాన్ని దించాలి. ప్రజా కోర్టు లో తీర్పు కావాలి. హంతకులు, హాంతకుల పార్టీకి ఓటు వేయవద్దు. షర్మిళ మాటను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.

ఉమ్మడి కుటుంబం అంటే నాన్న కు ఇష్టం. అన్న మాట జవదాటని తమ్ముడు వివేకానంద రెడ్డి..ఫ్యాక్షన్ ఉండకూడదు అని ఆలోచించిన వ్యక్తి వివేకా అని తెలిపారు.  మే 30, 2019 సీఎం గా జగన్ అన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన ప్రమాణం ప్రకారం ఇప్పుడు చేస్తున్నాడా ? సీఎం పదవిలో ఉన్న మీ చిన్నాను అతి దారుణంగా చంపిన వారిని ఎందుకు శిక్షించ లేదు. నేరస్తులకు శిక్ష పడేలా పోరాడుతున్న నా మీద, నా కుటుంబం మీదా ఆరోపణలు ఎందుకు అని ప్రశ్నించారు. నేను అయినా ఎవరైనా సరే వివేకా హంతకులను పట్టుకుని తీరాలి. మేమే చంపాం అని మీకు(సీఎం ) తెలిసి ఉంటే సీబీఐ కి సమాచారం ఇవ్వాలి అని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news