రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు : మంత్రి రోజా

-

రాష్ట్రాన్ని అప్పులో ఉభీలో నెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇవాళ ఆమె మీడియాత మాట్లాడుతూ.. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఉంది చంద్రబాబు వైఖరి. డబ్బులకు టికెట్లను అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు. సర్వేల తరువాత అభ్యర్థుల మార్పు జరిగింది. సంక్రాంతి లోపు టికెట్లు ప్రకటిస్తారు అన్నావు ఎందుకు చేయలేదు అన్నారు. అభ్యర్థులు లేక పొత్తులు పెట్టుకొని చంద్రబాబు వెళ్తున్నాడు.

కుప్పంలో గెలిచే అవకాశం లేదని చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్,లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి సిద్ధం అవుతున్నారు. అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వచ్చినా జగన్ ను ఏమి చేయలేరు. ఏపీలో లేని నాయకులు అంతా ఏకమై వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ప్రజలు రెండు చోట్ల ఒడించినప్పుడే పవన్ పరిస్థితి అర్థం అయ్యింది. వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. బీజేపీతో కలిసి పోటీ చేయనని చెప్పి 2014లో పొత్తు పెట్టుకున్నాడు. చంద్ర బాబు పొద్దున్నే జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో ఉంటాడు. సొంత జెండా ఎజెండా చంద్రబాబుకు ఉందా. అభ్యర్థులను మారుస్తా అని సీఎం పదె పదే చెప్పారు. సర్వేలు ఆధారంగా టికెట్లను ఇస్తాను అని ముందే చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version