రేషన్ కార్డు దారులకు అలర్ట్.. బియ్యం కాదనుకుంటే సరుకులు !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నెలలో 15 రోజుల పాటు అందిస్తామని వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే వచ్చి రేషన్ బియ్యం, సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రేషన్ షాప్ లలో ప్రతి ఒక్కరూ రేషన్ సరుకులు తీసుకుంటున్నారు.

Ration cards for Hijras in AP Good news that will make Chandrababu Naidu proud
The state government has instructed those who refuse ration rice to provide them with adequate dal, oil and other essential commodities

ఈ క్రమంలోనే రేషన్ బియ్యం వద్దనుకున్న వారికి వాటికి సరిపడా కందిపప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం కిలో బియ్యానికి 46 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక రేషన్ కార్డులో నలుగురు సభ్యులు ఉన్నట్లయితే 920 రూపాయల విలువైన 20 కిలోల బియ్యం అందుకుంటున్నారు. మెజార్టీ ప్రజలు వాటిని తీసుకొని కిలో రూ. 10- 20కే రేషన్ బియ్యం బయట అమ్ముతున్నారు. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రేషన్ బియ్యం విలువతో సమానమైన సరుకులను ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news