బీజేపీని నిలదీసే దమ్మున్న పార్టీ ఏపీలో లేదు – తోట చంద్రశేఖర్

-

గుంటూరు: బిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహానుభావుల పుణ్యమే ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛాయుత జీవితమన్నారు. మన దేశానికి 76 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చినా నేటికీ మౌలిక సదుపాయాలు ప్రజలకు అందడం లేదన్నారు.

ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు కష్టాలు మాత్రం తీరడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ఒకటి కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పై బిజెపి సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు తోట చంద్రశేఖర్. బిజెపిని నిలదీసే దమ్మున్న పార్టీ ఈ రాష్ట్రంలో ఒకటి కూడా లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అనేక అంశాలలో వెనకబడి ఉందన్నారు. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారో సీఎం బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news