రైతు రామేశ్వర్ తో లంచ్ చేసిన రాహుల్ గాంధీ.. నెటిజన్లు ఏమంటున్నారంటే ?

-

కాంగ్రెస్ పార్టీ అధినేతన రాహుల్ గాంధీతో కలిసి రైతు రామేశ్వర్ కూర్చొని ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ధరల పెరుగుదల కారణంగా తన దనయమైన పరిస్థితిని చెప్పిన రామేశ్వర్ అనే కూరగాయల వ్యాపారి వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రైతు రామేశ్వర్ తో కలిసి భోజనం చేశారు. ఇంతకు ముందు రామేశ్వర్ రావు వీడియోను పంచుకున్న రాహుల్.. కూరగాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితినీ సమీక్షించడానికి మరుసటి రోజు ఆజాద్ పూర్ మండిని సందర్శించారు. 

ఇక్కడ రామేశ్వర్ అనే రైతు కూరగాయల మార్కెట్ లో ఖాళీ బండితో కనిపించాడు. టొమాటోలు ధర ఎక్కువగా ఉండటంతో తాను కొనలేని స్థితిలో ఉన్నానని.. కూరగాయలు కొనేందుకు తన వద్ద డబ్బులు లేవని చెప్పి కన్నీరు కార్చారు. అంతేకాదు.. ఆజాద్ పూర్ మండిని సందర్శించిన తరువాత రాహుల్ గాంధీని కలవాలని రామేశ్వర్ తన కోరికను వ్యక్తం చేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంట్లో రామేశ్వర్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భారత్ భాగ్య విధాత అంటూ రాహుల్ తన అకౌంట్ లో పోస్ట్ చేశాడు. జహంగీర్ పూరికి చెందిన ఇప్పుడు రామేశ్వర్ కోరిక నెరవేరింది. అతనితో కలిసి రాహుల్ గాంధీ లంచ్ చేశారు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. నిజమైన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

Read more RELATED
Recommended to you

Latest news