నాపై దాడికి కుట్రపన్నారు – చంద్రబాబు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యా ప్రయత్నం చేశారని.. తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని అన్నారు. తాను చిత్తూరు జిల్లాకు వెళ్ళగా తనపై హత్యా ప్రయత్నం జరిగిందన్నారు చంద్రబాబు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల ప్రకారం తనను పర్యటించకుండా చేద్దామనుకున్నారని విమర్శించారు.

ప్రజల తరపున పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంగళ్లుకు తాను వెళ్ళకముందే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారని వివరించారు. తనపై దాడికి కుట్ర పన్నితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. ఎన్ఎస్జి ప్రొటెక్షన్ ఉన్న తానే పారిపోతే ఇక అర్థం ఏమంటుందన్నారు. ఈ దాడులన్నిటి పైన సిబిఐ దర్యాప్తుకి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news