జగన్ పల్నాడు పర్యటనలో వృద్ధుడు చనిపోవడానికి కారణమైన కారు వీడియో వైరల్ అవుతోంది. జగన్ పల్నాడు పర్యటనలో వృద్ధుడు చనిపోవడానికి కారణమైన కారు దేవినేని అవినాష్ ముఖ్య అనుచరుడు గొట్టిపాటి హరీష్ ది అంటూ టీడీపీ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.

జగన్ కు వీరాభిమాని అయిన హరీష్ అవినాష్ తో కలిసి ఇదే కారులో పల్నాడుకు వెళ్లారని అంటున్నారు. జగన్ కాన్వాయ్ తో పాటు వచ్చిన ఈ కారు వృద్ధుడిని ఢీకొట్టడంతో అతడు మృతి చెందారని పేర్కొంటున్నారు.