BREAKING : పల్నాడులో లారీని ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురు మృతి

-

ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వారు మరణించారు.

పిడుగురాళ్ల మండలం అంజనీపురం టోల్ ప్లాజా దగ్గర రోడ్డుపై ఈ ఘటన జరిగింది. గురజాలలో జరిగిన ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పిడుగురాళ్ల పట్నానికి చెందిన మారూరి నాగ తేజరెడ్డి, ఇందు, అమూల్యగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మద్యం మత్తులోనైనా లేదా నిద్రమత్తులోనైనా వాహనం నడపడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అతి వేగం కూడా కారణమై ఉండొచ్చని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news