నేటి నుంచి నెల రోజులపాటు శ్రీవారి పుష్కరిని బంద్‌

-

తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని ఇవాళ్టి నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనుండటమే దీనికి కారణమని టీటీడీ అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నట్లు వెల్లడించారు.  ఈ నెల రోజులు పుష్కరిణికి హార‌తి ఉండ‌దని చెప్పారు.

సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవ‌కాశం లేదని.. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవ‌స్థ అందుబాటులో ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. నిరంత‌రాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తామని వెల్లడించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొల‌గించి చిన్న చిన్న మ‌ర‌మ్మతుల‌ను పూర్తి చేస్తామని చెప్పారు. మరమ్మతులు పూర్తి చేసి చివ‌రి ప‌ది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేయనున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news