తిరుమల క్యూ లైన్ వివాదం.. టీటీడీకి క్షమాపణ చెప్పిన భక్తుడు

-

తిరుమల క్యూ లైన్ వివాదంపై .. టీటీడీకి క్షమాపణ చెప్పాడు భక్తుడు. తిరుమల క్యూ లైన్లో టీటీడీకి వ్యతిరేకంగా నిరసన తెలిపి, అనంతరం క్షమాపణ చెప్పాడు భక్తుడు. తనకు జ్వరంగా ఉందని, నిరసన తెలిపితే దర్శనానికి త్వరగా పంపిస్తారనే ఉద్దేశంతో అలా చేశానని తెలిపాడు భక్తుడు. దర్శనం సవ్యంగా జరిగిందని, అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నాడు భక్తుడు.

Tirumala queue line controversy Devotee apologizes to TTD
Tirumala queue line controversy Devotee apologizes to TTD

ఇక అంతకు ముందు తిరుమల క్యూ లైన్లలో సామాన్య భక్తుల అవస్థలు పడుతున్నట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్న భక్తులు ఆగ్రహం కట్టలు తెంచుకొని “డౌన్ డౌన్ ఛైర్మన్ బీఆర్ నాయుడు” అంటూ నినాదాలు చేశారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు కనీసం అన్న ప్రసాదాలు, చిన్న పిల్లలకు పాలు మంచి నీరు అందించడంలో టీటీడీ చైర్మన్ విఫలం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల క్యూ లైన్లలో ఉన్న సామాన్య భక్తులు. అయితే ఇందులో ఉన్న కీలక వ్యక్తి .. టీటీడీకి క్షమాపణ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news