తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేసీఆర్ కు లేఖ రాసి… కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిన… కల్వకుంట్ల కవిత తాజాగా కొత్త ఆఫీస్ పెట్టారు. జాగృతి పేరుతో రాజకీయాలు కొనసాగిస్తున్న కల్వకుంట్ల కవిత… కొత్త కార్యాలయం ఏర్పాటు చేశారు.

జాగృతి కార్యకలాపాలు నిర్వహించేందుకు కొత్త కార్యాలయాన్ని పెట్టారు కల్పకుంట్ల కవిత. తన నివాసం పక్కనే కొత్త జాగృతి కార్యాలయాన్ని.. ఓపెన్ చేశారు. అద్దెకు తీసుకొని ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక ఇవాళ సాయంత్రం 4:00 సమయంలో జాగృతి కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు కల్వకుంట్ల కవిత.