నేడు శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

-

టీటీడీ అధికారులు ఇవాళ శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి టికెట్ల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలోని గదుల కోటా మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో దర్శన టికెట్లు, గదులను ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చని వివరించారు.

మరోవైపు.. 2024 ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవా టికెట్లను ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18-50 ఏళ్ల వయోపరిమితి కలిగినవారు దీనికి అర్హులు అని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల, తిరుపతిలో భక్తుల స్వచ్ఛంద సేవలకుగాను జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవారిసేవ, నవనీత సేవ కోటాను ఈనెల 27న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ సేవలను https://www.tirumala.org/వెబ్‌సైట్‌లో భక్తులు బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news