తిరుమలలో 2 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు

-

వేసవి సెలవులు ముగుస్తున్న వేళ తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.

తిరుమలలో రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సుమారు 2 కిలో మీటర్ల వరకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు, పాలు తదితర సౌకర్యాలను అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, డీప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, టీటీడీ భద్రతాధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news