ఈ నెల 28న శ్రీవారి ఆలయం మూసివేత

-

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28వ తేదీన మూసి వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 29వ తేదీన తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉందని చెప్పారు. ఈ క్రమంలో గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోందని వివరించారు. ఈ నేపథ్యంలో 28వ తేదీన రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.

మరోవైపు పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా తెలంగాణలోని భద్రాద్రి శ్రీసీతారామ స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరుసటి రోజు అనగా ఈనెల 29వ తేదీన ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని చెప్పారు. సీతారాములకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news