ఇంటింటికి తాగునీరు, 24గంటల విద్యుత్‌ ఆపేయమంటారేమో?: కేటీఆర్‌

-

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా.. ఆ పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. ఇంటింటికి మంచినీళ్లు … ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపేయమంటారేమో? అందులో కూడా కేసీఆరే కనిపిస్తారు కదా అందుకే అంటూ ట్వీట్ చేశారు.

‘కాంగ్రెస్ అంటేనే… రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా.. ఇప్పటికే.. నమ్మి ఓటేసిన పాపానికి… కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు.. కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.’ అంటూ కేటీఆర్ తన ట్వీట్​లో ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news