తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

నిన్న(సోమవారం) శ్రీవారిని 69,928 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,297 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.