జూన్ 4న వెన్నుపోటు దినానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మేము అమలు చేసిన పథకాలను ఆపేశారు. వారు ఇస్తామన్నా సూపర్-6 పథకాలను ఇవ్వలేదు. ఇప్పటివరకు 143 హామీలను పట్టించుకోలేదు. ఈ పాలనకు వ్యతిరేకంగా రేపు జరిగే వెన్నుపోటు దినములో ప్రతి ఒక్కరు వారి నియోజకవర్గాల్లో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రభుత్వంపై ప్రతి ఒక్కరు నోరు నిత్య మాట్లాడాలి. ఈ ప్రభుత్వ పాలన ఎవరికి మంచిది కాదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారుతున్నాయి. అటు మాజీ మంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన కామెంట్లు చేశారు. వెన్నుపోటు దినం వైసిపి పార్టీ నిర్వహించనున్న నేపథ్యంలో జనసేన నేత కిరణ్ రాయల్ సెటైర్లు పేల్చారు. వెన్నుపోటు దినం కాదు గుండెపోటు దినాన్ని ప్రకటించాలి.
బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే తప్పకుండా గుండెపోటు, గొడ్డలి పోటు దినాన్ని నిర్వహించాలని కిరణ్ రాయల్ అన్నారు. మార్చి 15న గుండెపోటు దినంగా ప్రకటించాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు మెయిల్ చేశామంటూ కిరణ్ రాయల్ సంచలన కామెంట్లు చేశారు. కాగా కూటమి ప్రభుత్వ పాలనకు రేపటితో సంవత్సరం పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో