రేపటి నుండి దసరా వేడుకలు.. విజయవాడలో ఈ రూట్స్ క్లోజ్ !

-

విజయవాడ దుర్గగుడిలో రేపటి నుండి దసరా వేడుకలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య వాహనాలని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, నూజివీడు, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లించనున్నారు.

అలానే విశాఖపట్నం-చెన్నై మధ్య వాహనాలను హనుమాన్ జంక్షన్, అవనిగడ్డ, రేపల్లె మీదుగా దారి మళ్లించనున్నారు. అంతే కాక విజయవాడ-హైదరాబాద్ మధ్య బస్ లు చల్లపల్లిబంగ్లా, బుడమేరు వంతెన, పైపుల రోడ్, సితార సెంటర్ మీదుగా గొల్లపూడి వై జంక్షన్ వైపుకు మళ్లించనున్నారు. ఇక మూలానక్షత్రం రోజున ప్రకాశం బ్యారేజ్ పై ఎటువంటి వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఇస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే ఈ ఆంక్షలు అమలు చేయనున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news