తూర్పు గోదావరి జిల్లాలో విషాదం.. గుళికలు కలిపిన టీ తాగి వృద్ధ దంపతులు మృతి

-

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర  విషాదం చోటు చేసుకుంది.  గుళికలు కలిపిన టీ తాగి వృద్ధ దంపతులు వెలుచూరి అప్పాయమ్మ(70), వెలుచూరి గోవింద్ (75) మృతి చెందారు. టీ పొడి అనుకొని అప్పాయమ్మ పురుగుల మందు గుళికలను టీలో వేసింది. ఇది తెలియక అప్పాయమ్మ తనతో పాటు భర్త గోవింద్ కు కూడా ఇచ్చింది. దీంతో ఇది సేవించిన కొద్ది సేపటికే వీరికి గొంతులోంచి నురగలు కక్కారు.

స్థానికులు గమనించి వెంటనే   అప్పాయమ్మ, గోవింద్ లను రాజమండ్రిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ   వీరిద్దరూ  మరణించారు. అప్పాయమ్మ వృద్దురాలు కావడంతో కాస్త కంటి చూపు మందగించింది. దీంతో టీ పొడి అనుకొని గుళికలు వేయడంతో ఆ వృద్ద దంపతులు ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version